Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JEE Main from February 23rd

 ఫిబ్రవరి 23 నుంచి JEE మెయిన్

JEE Main from February 23rd

దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 ఎంట్రన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అలాగే మొత్తం నాలుగు సార్లు జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. తొలిసారి ఫిబ్రవరిలో నిర్వహించనుండగా.. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, కన్నడ, మరాఠీ, పంజాబ్‌, తమిళ్‌, ఉర్దూ, ఒడియా, మలయాళం..ఇలా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుందని మంత్రి తెలిపారు.

అలాగే ఈ సారి పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు. 90 ప్రశ్నలకు గాను 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, లేదంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ విభాగాల్లో 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా విద్యార్థి నాలుగుసార్లూ పరీక్షకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. అప్లికేషన్‌ ఫారంలను jeemain.nta.nic.in నంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "JEE Main from February 23rd"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0