Teachers Transfers 2020
11 నుంచి బదిలీలకు ఆప్షన్ల నమోదు
- టీచర్ల సీనియార్టీ జాబితాపై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
- నేడు తుది సీనియార్టీ జాబితా విడుదలకు అధికారుల కసరత్తు
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాల స్వీక రణ సోమవారంతో ముగిసింది . బదిలీలకు అర్హులైన ఉపా ధ్యాయుల సీనియార్టీ జాబితా మంగళవారం విడుదల చేయ నున్నారు . కాగా ఆన్లైన్లో ఈ నెల 11 నుంచి 15 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది . జిల్లాలో ప్రభుత్వ , జిల్లా పరిషత్ యాజమాన్యాల వారీగా బదిలీ కోరుతూ ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల నుంచి 5,896 మందితో విడుదల చేసిన సీనియార్టీ జాబితాకు సంబంధించి సోమవారం గడువు ముగిసే సమయానికి 334 విజ్ఞప్తులు వచ్చాయి . సీని యార్టీ జాబితాలో ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు , మేనే జీమెంట్ మార్పు , స్పౌజ్ కేటగిరీల వారీగా ఆన్లైన్లో పం పిన అభ్యంతరాలను పరిశీలిస్తే ఎక్కువ మంది ఉపాధ్యా యులు ఒకే సమస్యపై పదే , పదే పంపినట్లు తెలుస్తోంది . 60 మంది ఉపాధ్యాయులు ప్రింటవుట్ రూపంలో అభ్యంతరాలను అందజేశారు . అయితే ఆన్లైన్ లో 334 విజ్ఞప్తులు రావ డం , వ్యక్తిగతంగా కేవలం 60 మంది ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి అందజేసిన విజ్ఞప్తులపై పరిశీలన జరపడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది .
ఒక ఉపాధ్యాయుడు 49 సార్లు మెయిల్
బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తాము గుర్తిం చి సమస్యపై పదే , పదే పంపిన కారణంగా ఆన్లైన్ లో పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయి . ఒక ఉపాధ్యాయుడు 49 సార్లు మెయిల్స్ పంపినట్లు అధికారులు గుర్తించారు . వారం రోజులుగా స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించిన అధి కారులు మంగళవారం సీనియార్టీ జాబితా విడుదల చేసేం దుకు కసరత్తు చేస్తున్నారు . ఈవో కార్యాలయ పరిధిలో పరిష్కరించాల్సిన వాటిని ఇక్కడే పరిష్కరించేందుకు నిర్ణ యించిన డీఈవో గంగాభవానీ ప్రాధాన్యత క్రమంలో పాయింట్ల కేటాయింపునకు సంబంధించిన పలు దరఖా స్తులను ఉన్నతాధికారులకు నివేదించారు .
0 Response to "Teachers Transfers 2020"
Post a Comment