Prepare and provide a fund of question Banks for students writing board exams.
బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నల నిధిని తయారుచేసి ఇవ్వండి.
విద్యాశాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన
దిల్లీ: ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొవిడ్-19 వల్ల విద్యార్థుల చదువులు సక్రమంగా సాగలేదని, ఇంటర్నెట్ అనుసంధాన సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆన్లైన్ తరగతులు వినడం కూడా సాధ్యకావడంలేదని పాఠశాల విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతుల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా పాఠ్యాంశాల వారీగా ముందుగానే ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన ప్రశ్నల నిధి(క్వశ్చన్ బ్యాంకు) రూపొందించి ఇవ్వాలని విద్యా శాఖకు సూచించింది. పరీక్షలకు దాని నుంచే ప్రశ్నలను ఎంపికచేయాలని పేర్కొంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం ప్రసారమయ్యే పాఠాల బోధన వివరాలను తెలియజేస్తూ విస్తృతంగా ప్రకటనలు ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ(విద్య) ఛైర్మన్, భాజపా ఎంపీ వినయ్ సహస్ర బుద్దే సూచించారు
0 Response to "Prepare and provide a fund of question Banks for students writing board exams."
Post a Comment