100% Admissions in AP IIIT
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 100% అడ్మిషన్లు
- ఆర్జీయూకేటీ చాన్సెలర్ కేసీ రెడ్డి వెల్లడి
- గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో పెద్దపీట
- ఆర్జీయూకేటీలో పూర్తి స్థాయిలో 4,407 సీట్ల భర్తీ
- 54.5 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకే
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ్స(ఆర్జీయూకేటీ) అధీనంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో 100ు అడ్మిషన్లు అయ్యాయి. మంజూరైన సీట్లు(4000), ఈడబ్ల్యుఎస్ కోటా ద్వారా వచ్చిన సప్లిమెంటరీ సీట్లు(400), ఎన్ఆర్ఐ సీట్ల(7)తో కలుపుకొంటే మొత్తం మీద 4,407 సీట్లు భర్తీ అయ్యాయి. 2020-21 విద్యా సంవత్సరంలో ఆర్జీయూకేటీ అడ్మిషన్ల కోసం రెండు దశల కౌన్సెలింగ్లతో పాటు స్పెషల్ కేటగిరీ సీట్లకోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1,823 (41.4ు)మందికి, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 2,584 (58.6ు) మంది అభ్యర్థులకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి.
అర్బన్ ఏరియాలోని పాఠశాలలకు చెందిన 2,003 (45.5ు) మంది, గ్రామీణ ప్రాంత పాఠశాలలకు చెందిన 2,404(54.5ు) మంది సీట్లు పొందారు. నూజివీడు క్యాంప స్లో 1,105మందికి, ఆర్కే వ్యాలీ క్యాంప్సలో 1,102మందికి, ఒంగోలు క్యాంప్సలో 1,100 అడ్మిషన్లు పొందారు. శ్రీకాకుళం క్యాంప్సలో 506(46ు) మంది బాలికలు, 594(54ు) మంది బాలురు ప్రవేశం పొందారు. జనరల్ కేటగిరీ కింద 3,743 మందికి, స్పెషల్ కేటగిరీ(పీహెచ్, ఎన్సీసీ, కాప్, స్పోర్ట్స్) కింద 257 మందికి, ఈడబ్ల్యుఎస్ కోటా కింద 400 మందికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఏడుగురికి అడ్మిషన్ లభించింది. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సెలర్ కేసీ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యాసంవత్సరానికి గ్రామీణ విద్యార్థులకే అత్యధిక సంఖ్యలో సీట్లు లభించాయి. రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్ ఐటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక్కో దానిలో వేయి చొప్పున మొత్తం 4 వేల సీట్లు ఉన్నాయి.
ఈడబ్ల్యూఎస్ కోటాలో అదనంగా సూపర్ న్యూమరరీ కింద 10 శాతం చొప్పున 400 సీట్లను, ఎన్ఆర్ఐ కోటా కింద 7 సీట్లను కలిపి మొత్తం 4,407 సీట్లను ఈ విద్యాసంవత్సరంలో కేటాయించారు. గతేడాది కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ సెట్లో ఎక్కువ స్కోరు సాధించి ర్యాంకులు పొందిన వారికి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించారు.
0 Response to "100% Admissions in AP IIIT"
Post a Comment