Description of how the 'E-Watch' app works for Panchayat Elections.
పంచాయతీ ఎన్నికల 'E-Watch' యాప్ ఎలా పనిచేస్తుందో వివరణ.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ యాప్ను విడుదల చేశారు. యాప్ తయారీకి రిలయన్స్ జియో సంస్థ సహకారం తీసుకున్నట్లు, రూ.5లక్షలు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు తెలిపారు. మరి ఈ యాప్ ప్రత్యేకత, పనితీరు వంటి విషయాలను తెలుసుకుందాం..!
యాప్ పనిచేసే విధానం
- గురువారం నుండి గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ఇన్ హౌస్లోనే మొబైల్ అప్లికేషన్ ఉంటుంది.
- ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు.
- చేసిన ఫిర్యాదు ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం లేదు.
- ముందుగా కాల్ సెంటర్కు తర్వాత కలెక్టర్కు ఫిర్యాదు వెళ్తుంది.
- డబ్బు, మద్యం పంపిణీ, లౌడ్ స్పీకర్లు, ఉద్యోగుల విధుల్లో అలసత్వం తదితర అంశాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు దారు ఫొటోలు, వీడుయోలు 5ఎంబీ వరకూ పంపవచ్చు.
- ప్రతి కంప్లైంట్కు సంఖ్య ఇచ్చి వెరిఫై చేస్తారు. తన ఫిర్యాదుపై సమాచారాన్ని కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు దారు తెలుసుకునే అవకాశం ఉంది.
- ఫిర్యాదుదారు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేసుకునే సదుపాయమూ ఉంది.
- ముఖ్యమైన ప్రతి ఫిర్యాదును ఎస్ఈసీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు.
- సీరియస్ ఫిర్యాదు అయితే వెంటనే.. మిగిలినవి గరిష్టంగా 3 రోజుల్లో పరిష్కారిస్తారు.
- దీనితో పాటు ఎఈసీ ఏర్పాటు చేసిన కంప్లైట్ సెల్ కూడా అందుబాటులో ఉంటుంది.
- ఎస్ఈసీ కంప్లైట్ సెల్ తో పాటు కాల్ సెంటర్ సమన్వయం ఉంటుంది.
- కంప్లైట్ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
- వెబ్సైట్గానూ, మొబైల్ యాప్గానూ ఈ యాప్ పనిచేస్తుంది.
0 Response to "Description of how the 'E-Watch' app works for Panchayat Elections."
Post a Comment