Education neglected in the central budget
కేంద్ర బడ్జెట్ లో విస్మరణకు గురైన విద్యారంగం.
- నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది.
- అరకొర కేటాయింపులు మాత్రమే జరిపింది.
- మొత్తం బడ్జెట్లో విద్యారంగం వాటా గత సంవత్సరం 3.26 %కాగా అది ఈ బడ్జెట్లో 2.67%కి తగ్గింది.
- గత సంవత్సరం మొత్తం విద్యా రంగానికి 99 వేల 311 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో అది 93,225 కోట్లకు తగ్గింది
- దీనిలో ప్రధానంగా పాఠశాల విద్యకు 54874 కోట్లు (గత బడ్జెట్ లో 59,845 కోట్లు) కేటాయించగా, ఉన్నత విద్యారంగానికి 38 వేల 351 కోట్లు (39 వేల 466 కోట్లు) కేటాయించారు.
- పాఠశాల విద్యలో NMMS కు 350 కోట్లు (373 కోట్లు),
- ఆపరేషన్ డిజిటల్ బోర్డు కు ఒక కోటి( 25 కోట్లు),
- కేంద్రీయ విద్యాలయాలకు 6,800 కోట్లు (5516 కోట్లు),
- నవోదయ విద్యాలయాలకు 3800 కోట్లు (3300 కోట్లు)
- NCERT కి 500 కోట్లు (300 కోట్లు)
- నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కు 31,300 కోట్లు( 38, 860 కోట్లు),
- సమగ్ర శిక్ష కు 31,300 కోట్లు (38,860 కోట్లు),
- ఉపాధ్యాయ విద్య కు 250 కోట్లు (110 కోట్లు),
- మధ్యాహ్న భోజనానికి 11500 కోట్లు (11000 కోట్లు) కేటాయింపులు జరిగాయి.
- దీనిలో ప్రధానంగా సమగ్ర శిక్ష ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కేంద్రం అందించనున్న నిధులలో భారీగా ఏడు వేల కోట్లకు కోత విధించింది
- కేంద్ర బడ్జెట్ లో కనీసం 10 శాతం విద్యారంగానికి కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా.
- బడ్జెట్లో విద్యారంగం వాటా ఏ ఏటికాయేడు కుంచించుకుపోతూ 2.67% కు తగ్గడం కేంద్రానికి విద్యా రంగం పట్ల ఉన్న వివక్షతకు అర్థం పడుతున్నది.
- విద్యావంతులు, విజ్ఞాన వంతులు, ఆధునిక యుగంలో సైన్స్, శాస్త్రవేత్తల ను ఎర్పాటు చేసుకోవలసి క్లిష్టమైన పరిస్థితులలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపొవడం దేశ యువతకు ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు భరోసా ఎమి ఇస్తారు...
0 Response to "Education neglected in the central budget"
Post a Comment