Online 'exam pay discussion
ఆన్ లైన్ లో 'పరీక్షా పే చర్చ
రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ ఛాన్స్ : మోడీ
విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న ఒత్తి డి,భయాన్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి వారిని గత కొన్నేళ్లుగా ఉత్తేజపరుస్తూ వస్తు న్నారు. పరీక్షలు ఎలా రాయాలి..? ఆ సమ యంలో ఎలా వ్యవహరించాలి..? అన్నదాని పై మోడీ స్వయంగా విద్యార్థులతో చర్చించారు. దీని కోసం పరీక్షా పే చర్చ కార్యక్రమానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ ముఖా ముఖిగా జరిగే ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరగ నుంది. వచ్చే నెల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని మోడీయే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'మన ధైర్యవంతమైన ఎగ్జా మ్ వారియర్లు పరీక్షలు సన్నద్ధమవుతున్న వేళ పరీక్షా పే చర్చ 2021 వచ్చేసింది ఈసారి పూర్తిగా ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తం గా విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నా. రండి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా చిరునవ్వు తో పరీక్షలకు హాజరవుదాం' అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది పరీక్షా పే చర్చలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటున్న ట్టు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పరీక్షా పే చర్చకు హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురువారం నుంచి ప్రారంభమైనట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోరత్రియాల్ తెలిపారు. మార్చి 14వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. 2018 నుంచి ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సమస్యల ను మోడీ నివృత్తి చేస్తారు.
0 Response to "Online 'exam pay discussion"
Post a Comment