How to continue studying?
చదువులెలా కొనసాగలి?
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల కొరత
- బడిబాటలో విద్యార్థులను చేర్చుకున్న ఉపాధ్యాయులు
- ఆన్లైన్లో నమోదు కాక ఇబ్బందులు
- చైల్డ్ ఇన్ఫోలో వివరాల ఆధారంగా బుక్స్ సరఫరా
- చాలా మందికి అందని పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. పాఠ్య పుస్తకాలు లేకపోవడంతో చదువుకోవడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాకపోతే ప్రభుత్వం పుస్తకాలు సరఫరా చేయదు. ఇలా ఆన్లైన్లో నమోదు కాని విద్యార్థులు జిల్లావ్యాప్తంగా వందలాది మంది ఉన్నారు. బడి బాట ద్వారా కొందరు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి నేరుగా ప్రభుత్వ బడుల్లో చేరిన మరికొందరు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు తొలిరోజుల్లో చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. సంబంధిత ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల పేర్లను మండల స్థాయిలో అధికారులే తొలగించారు. ఆన్లైన్లో తొలగింపు వెసులుబాటు మండలస్థాయిలో ఉండేది. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి టీసీలు తీసుకోకుండానే విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరిపోయారు. ఈ విషయమై ప్రైవేటు యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి.తమ వద్ద ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటున్నారని జిల్లా విద్యాశాఖ అధికా రులకు ఫిర్యాదుచేశారు. మండల స్థాయిలోనే ప్రైవేటు పాఠశాలల జాబితా నుంచి చైల్డ్ ఇన్ఫోలో పేర్లు తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా అప్పటి వరకు పేర్లు తొలగించిన విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యారు. మిగిలిన వారంతా బడులకు వెళుతున్నా చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాలేదు. దాంతో వారికి పుస్తకాలు సరఫరా చేయలేకపోతున్నారు.
ఆన్లైన్లో నమోదైతేనే పాఠ్య పుస్తకాలు
ఆన్లైన్లో నమోదైన వారికి మాత్రమే తాజాగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. గతంలోనే 3,00,15,322 పుస్తకాలు పంపిణీ చేశారు. గడచిన ఏడాది ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల వివరాల ఆధారంగా తొలుత ఇండెంట్ పెట్టారు. ఆ మేరకు ప్రభుత్వం పుస్తకాలను సరఫరా చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వచ్చి చేరిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ పెండింగ్లో ఉంది. చైల్డ్ ఇన్ఫోలో వారిలో కొందరిని నమోదుచేశారు.ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వమే జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాల అదనపు ఇండెం ట్ను నిర్ధారించింది. గడచిన వారం వ్యవధిలో జిల్లాకు 2,40,876 పుస్తకాలను పంపింది. చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాని విద్యార్థులు ప్రభుత్వ బడులకు హాజరవుతున్నా పుస్తకాలు పంపిణీ చేసే అవ కాశం లేదు. వారి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అమ్మ ఒడి ప్రభావం
వాస్తవానికి ప్రైవేటు విద్యాసంస్థల్లో సాంఘిక సంక్షేమ శాఖ కోటాలో ఎస్టీ, ఎస్టీ విద్యార్థులు అనేక మంది చదివేవారు. సాంఘిక సంక్షేమ శాఖ వారి ఫీజు చెల్లించేది. ప్రభుత్వం అమ్మఒడి అమలు చేసిన తర్వాత ప్రైవేటు విద్యాసంస్థల్లో సాంఘిక సంక్షేమ కోటాను ఎత్తి వేసింది. దీంతో రెండు వేల మంది వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ప్రైవేటు విద్యాసంస్థలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఆంగ్ల మాద్యమం ప్రభావంతోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే సంఖ్య ఈ ఏడాది అధికమైంది. ఇలా చేరిన వారిలో అనేక మంది ఆన్లైన్లో నమోదు కాకుండానే తరగతులకు హాజరవుతున్నారు. వీరికి పుస్తకాలు లేవు. ప్రభుత్వం ఇచ్చే అవకాశమూ లేదు.ప్రస్తుతం చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ను నిలిపివేశారు. ఫీజులు చెల్లిస్తేనే ప్రైవేటు స్కూళ్లు టీసీలు ఇస్తారు.. దీంతో ఎంతో మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రైవేటు పాఠశాలల నుంచి టీసీలు తెచ్చుకుంటేనే అధికారికంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అవకాశం ఉంటుందని డీఈవో వివరించారు...
0 Response to "How to continue studying?"
Post a Comment