No rest to Teacher
మాస్టారు కు తీరిక లేదు !
విజయవాడ సమీపంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇటీవల హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు . వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తర లించారు . ఈ ఘటనకు కారణాలు విశ్లేషిం చగా ... విద్యాశాఖ ప్రవేశ పెట్టిన యాప్ లతో కుస్తీ పడుతూ , సర్వర్ తదితర సమస్యలతో సకాలంలో పని పూర్తి కాక తీవ్ర ఒత్తిడికి గురై నట్లు తేలింది .
జగ్గయ్యపేట సమీపంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాప్ లలో వివరాలు అప్ లోడ్ చేయడంపై అవగాహన లేక సహచర ఉపాధ్యాయుడికి ఆ బాధ్యత చూడాలని కోరారు . తానెందుకు అప్లోడ్ చేయాలని ఆ ఉపాధ్యాయుడు , ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది . సహచరులు కలగ జేసుకుని పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది .
తొలి గంట నుంచే తిప్పలు
- విద్యా శాఖ ప్రవేశ పెట్టిన వివిధ యాల్లో వివరాలు నమోదు చేయడానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించక ప్రధానోపా ధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు .
- పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర కీలకం .
- కానీ ప్రస్తుతం వారు దానిపై దృష్టి సారించలేకపోతున్నారు .
- పాఠాల బోధన కంటే యాప్ ల పైనే ఎక్కువ సమయం కేటా యించాల్సి వస్తోందని వాపోతున్నారు .
- ఉదయం బడికి రాగానే బయోమెట్రిక్ వేయాలి.
- సర్వర్ సక్రమంగా పనిచేయక తొలి గంటలోనే ఇబ్బందులు ప్రారంభమవుతు న్నాయి .
- మొదటి పిరియడ్ లోపు విద్యార్థుల హాజరు తీసుకొని యాప్లో పొందుపరచాలి
- ఆ ప్రక్రియ గడువులోగా పూర్తి కావడం లేదు
బోధనకు ఇబ్బందులెన్నో
- ఐఎంఎంఎస్ యాప్లో మధ్యాహ్న భోజన వివరాలు పొందుపరచాలి .
- తనిఖీ విభా గంలో వంట గది ప్రదేశం , సరకులు నిల్వ ప్రాంతం , పాత్రలు , చెత్త డబ్బా , విద్యార్థులు తినే ప్రదేశం , మంచినీటి సౌకర్యం , మరుగుదొడ్ల నిర్వహణ , చేతుల శుభ్రత , కోడి గుడ్లు ఇస్తు న్నారా ? లేదా ? వంటి ఫొటోలను అప్లోడ్ చేయాలి .
- ఎడ్యుకేషన్ సెక్రటరీలు , ఎఎంసీలు , సీఆర్పీలకు అప్ లోడ్ చేసిన ఫొటోలను , అంశా లను వివరించాలి.
- పరీక్షా ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
- పాఠశాల ముగిసిన తరువాత ఇన్ - ఔట్ ఉపాధ్యాయుల హాజరు వివరాలను పొందుపర చాలి.
- అమ్మ ఒడి , జగనన్న విద్యా కానుక సమా చారం కూడా నిక్షిప్తం చేయాలి.
- జగనన్న విద్యాదీవెన కిట్లకు విద్యార్థుల తల్లులతో వేలి ముద్రలు తీసుకోవాలి.
- ఎంఈవో , డీవై ఈవో , విజిలెన్సు అధికా రులు వచ్చినప్పుడు యాప్లు వినియోగిస్తున్న తీరును వివరించాలి.
- నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో ఈ యాప్ల వినియోగం ప్రధానో పాధ్యాయులకు మరింత తలనొప్పిగా మారింది .
- వాటితో పాటు విద్యార్థుల తల్లిదండ్రు లకు సమాధానం చెప్పడం , పాఠశాల నిర్వహణ నిత్యకృత్యమే .
- ఆయా యాల్లో సమాచారం పెట్టకపోతే ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అవుతున్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు .
- పాఠశా లలు ఆలస్యంగా ప్రారంభం కావడం , సిలబస్ పూర్తి కాకపోవడం వంటి అంశాలతో సతమత మవుతుంటే ఈ యాప్ల వినియోగంతో ఉపా ధ్యాయులు మరింత కుంగిపోతున్నారు .
ఒకరే ఉన్న చోట ...
జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు మూడు వేల పైగా ఉండగా ... అందులో ప్రస్తుతం 500 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి . ఆ ఉపాధ్యా యులు విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు సమయం సరిపోవడం లేదు . ఇద్దరు ఉన్న చోట సైతం యాప్లను వినియోగించడం కష్టంగా ఉందని , విద్యాశాఖ అధికారులు స్పందించి పని భారం తగ్గించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు .
0 Response to "No rest to Teacher "
Post a Comment