TS: 30% fitment for employees - CM announced on PRC
టిఎస్: ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ పీఆర్సీపై ప్రకటన చేసిన సిఎం
రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు.
ఇతర ముఖ్యాంశాలు:
- EHS కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.
- PSHM పోస్టులు మంజూరు.
- KGBV మహిళా సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవు.
- CPS వారికి ఫ్యామిలీ పెన్షన్ కు ఓకే.
- వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు – తక్షణం అమలు.
- 30 శాతం PRC - ఏప్రిల్ 1 నుండి అమలు.
0 Response to "TS: 30% fitment for employees - CM announced on PRC"
Post a Comment