Badiki pampaalaa vaddaa
బడికి పంపాలా.. వద్దా!
పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు కరోనా సోకింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం వసతి గృహాలు మూసేశారు. ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టారు. జేఎన్టీయూలో ఇంజినీరింగ్ తృతీయ, తుది సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల్లో పది, ఇంటర్, ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇంటర్, పది పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశారు. ద్వితీయ ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మే 5 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తీరా పరీక్షల సమయంలో వసతి గృహాలకు సెలవులు ప్రకటిస్తే తమ పిల్లల భవిత ఏమిటన్న సందిగ్ధంలో తల్లిదండ్రులు ఉన్నారు.
జాగ్రత్తలే శరణ్యం
కొన్ని పాఠశాలల విద్యార్థులు మాస్క్లు పెట్టుకొని తరగతులకు హాజరవుతున్నా.. గదుల్లో భౌతిక దూరం పాటించడం లేదు. అవసరం మేర గదులు లేకపోవడమే అందుకు కారణం. వసతి గృహాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో 62 కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో చదివే విద్యార్థులు భౌతిక దూరం పాటించడం లేదు. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఆరు రోజుల్లోనే 21 మంది విద్యార్థులకు కరోనా సోకింది.
0 Response to "Badiki pampaalaa vaddaa"
Post a Comment