Prime Minister Narendra Modi briefing the Chief Ministers on the ongoing Corona Second Wave in the country
దేశంలో నెలకొన్న కరోనా సెకెండ్ వేవ్పై ప్రస్తుతం ముఖ్యమంత్రులతో జరుగుతున్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి వివరణ
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న కరోనా సెకెండ్ వేవ్పై ప్రస్తుతం ముఖ్యమంత్రులతో జరుగుతున్న సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్న ఆయన.. కరోనాతో పోరాటం చేసేందుకు సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులను కోరారు. 'ఈ సెకెండ్ వేవ్తో మనందరం పోరాడాలి. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి రోజువారి కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారు. ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగింది. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి' అని మోదీ తెలిపారు.
పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రులతో చెప్పారు. అలాగే టీకాలు వృథా కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న తరువాత కూడా దేశ ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మోదీ స్పష్టం చేశారు.
0 Response to "Prime Minister Narendra Modi briefing the Chief Ministers on the ongoing Corona Second Wave in the country"
Post a Comment