Specialized Vaccine Center for Government Employees
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం
9 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం: జేసీ శివశంకర్
ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయాలని జేసీ శివశంకర్ ను కలిసిన విద్యాసాగర్, తదితరులు
45 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ ఎల్.శివశంకర్ తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్, కార్యవర్గ సభ్యులు జేసీని ఆయన కార్యాలయంలో శనివారం కలిసి ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన జేసీ ఈ నెల 9 నుంచి స్థానిక ఏపీ ఎన్టీవోహోంలో ఈ ప్రత్యేక వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాసాగర్ మాట్లాడుతూ కొవిడ్ ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిన కలెక్టర్ జేసీకి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ ఇక్బాల్, కోశాధికారి పి. రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Response to "Specialized Vaccine Center for Government Employees"
Post a Comment