Breaking: Clarity on ten exams in AP .. AP government announces postponement ..
Breaking : ఏపీలో పది పరీక్షలపై క్లారిటీ .. వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన .
ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనితో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే యోచన లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీచర్లు ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని ఆఫిడివేట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు కోరిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
*పదవ తరగతి* విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత* దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ 10 వ తరగతి పరీక్షలు *వాయిదా వేయాలని* ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ *కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం* తీసుకుంటామని...
*త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని* అన్నారు.
*ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని* తెలిపారు. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్లు మంత్రి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. *సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరినట్లు* తెలిపారు.10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని..* తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఉపాధ్యాయులు కూడా కరోనాకు ప్రాణాలు* కోల్పోయారన్నారు.
పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు.
0 Response to "Breaking: Clarity on ten exams in AP .. AP government announces postponement .."
Post a Comment