Do not want online classes on vacation Machilipatnam DEO Tahera Sultana
సెలవుల్లో ఆన్లైన్ తరగతులు వద్దు మచిలీపట్నం డీఈఓ తాహెరా సుల్తానా
మచిలీపట్నం: వేసవి సెలవులు ప్రకటించినందున పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి వీల్లేదని డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. పరీక్షల పేరుతో విద్యార్థులకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాల వారు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని, ఆన్లైన్ తరగతులు నిర్వహించినట్లు తేలితే భారీ జరిమానా విధిం చటంతో పాటు, పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ ద్వారా పరీక్షలు కూడా నిర్వహించకూడదన్నారు. ఎక్క డైనా ఇలా నిర్వహిస్తున్నట్లెతే 85199 46090 నంబరు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
0 Response to "Do not want online classes on vacation Machilipatnam DEO Tahera Sultana"
Post a Comment