Andhra Pradesh Institute of Social Welfare Gurukul Schools, (APSWREIS) Admission for Class 5
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (APSWREIS) 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021-22 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము)లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది: 17-06-2021 నుండి 07-07-2021 వరకు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాలి.
ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Co-ordinators) లేదా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల వారిని గానీ సంప్రదించగలరు.
ప్రవేశ పరీక్ష తేదీని తదుపరి దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ సెల్ ఫోనుకు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
అభ్యర్థులకు సూచనలు:
1) ప్రవేశమునకు అర్హత :
1. వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC/ST) విద్యార్ధులు తేది.01-09-2008 నుడి 31-08-2012 మద్య
జన్మించిన వారై వుండాలి, ఓ.సి., బి.సి., యస్. సి. కన్వర్టేడ్ క్రిస్టియస్ (B.C-C) విద్యార్ధులు తేది. 01-09-2010 నుడి 31-08-2012 మద్య జన్మించిన వారై వుండాలి.
2. విద్యార్ధులు తమ స్వంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సంబంధిత జిల్లాలలో, 2019-20 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2020-21 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
3. ఆదాయ పరిమితి:
అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2020-21) రూ 1,00,000/- మించి ఉండరాదు.
II) రిజర్వేషన్ల వివరాలు :
- 1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C - 75%, S.C. కన్వర్టర్ క్రిస్టియన్లు - 12%, S.T - 6%, B.C - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.
- 2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, వెట్టి చాకిరీ నుండి
- బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.
- 3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
- 4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కేటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు.
II) దరఖాస్తు చేయు విధానం :
- 1) ఆసక్తి కల విద్యార్ధులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్ లో మాత్రమె
- దరఖాస్తులు సమర్పించవలయును.
- 2)తేది 17-06-2021 నుండి 07-07-2021 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు
- స్వీకరించడము జరుగుతుంది.
- తేదీ 07-07-2021 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
- 3) విద్యార్ధులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని సాంఘిక
- సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా గాని దరఖాస్తులు సమర్పించవలయును.
- 4) దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుమును చెల్లించనవసరములేదు.
- 5)ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్ధి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకొన్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
- 6)ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.
IV) ఎంపిక విధానము:
2021-22 విద్యా సంవత్సరమునకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు
దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయించడము
జరుగుతుంది.
0 Response to "Andhra Pradesh Institute of Social Welfare Gurukul Schools, (APSWREIS) Admission for Class 5"
Post a Comment