AP Tenth and Inter Exams:
AP Tenth and Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ తో పాటు అన్ని ఎగ్జామ్స్ ఆ నెలలోనే.. కసరత్తు ప్రారంభించిన జగన్ సర్కార్.. వివరాలివే.
కరోనా కేసులు తగ్గుతుండడంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని భావిస్తోంది.
- దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేస్తున్నా.. విద్యార్థుల భవిష్యత్ కోసం తాము అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తామని జగన్ సర్కార్ అనేక సార్లు స్పష్టం చేస్తోంది.
- విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాల నుంచి కూడా పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
- అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
- జూలై నాటికి కేసులు ఇంకా తగ్గుతాయని.. దీంతో ఆ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
- పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా మారినా.. జులైలో ఇంటర్ తో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
- జూన్ 20 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత సమీక్ష నిర్వహించి పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు అధికారులు.
- ఇంటర్ పరీక్షలు జులైలో పూర్తయితే ఆగస్టులో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
- ఈ పరీక్షలన్నీ అనుకున్న సమయానికి పూర్తి అయితే.. సెప్టెంబర్ లో తరగతులు ప్రారంభించవ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
- టెన్త్ ఎగ్జామ్స్ కూడా జూలై లేదా ఆగస్టులోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
0 Response to "AP Tenth and Inter Exams: "
Post a Comment