Examinations as soon as conditions improve: Minister Suresh సురే.
పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు: మంత్రి సురేష్.
రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో మంగళవారం ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరిస్థితులు అనుకూలించాకే నిర్వహిస్తామన్నారు. పిల్లల ఆరోగ్యం, భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జాతీయ విద్యా విధానంపై అపోహలొద్దు
జాతీయ విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఉపాధ్యాయులకు దీనిపై అపోహలు వద్దని మంత్రి సురేష్ తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకుంటున్న కొన్ని చర్యలపై ఉపాధ్యాయులు రకరకాల ఊహాగానాలు తెస్తున్నారని, వీటి అమలుపై చర్యలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
0 Response to "Examinations as soon as conditions improve: Minister Suresh సురే."
Post a Comment