Notification release
ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష (ఇఎపి సెట్)- 2021కు శనివారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఇందు కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇఎపి ఫెట్ కన్వీనర్ వీ. రవీంద్ర శుక్రవారం విడుదలచేశారు. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎస్సీహెచ్.ఏపీ.జీవోవీ. ఇన్/ ఇఎపీసీఈటీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. జులై 25 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రూ.500ల అపరాధ రుసుంతో ఆగస్టు 5 వరకు, రూ.1000ల రుసుంతో ఆగస్టు 8 తేది వరకు, రూ.5వేలతో 16వ తేది వరకు, రూ.10వేల రుసుంతో 18వ తేది వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలి. ఆగస్టు 12న వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రోజుకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసి అభ్యర్థులు రూ.600, బీసి అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500లు చెల్లించాలి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసి అభ్యర్థులు రూ.1200లు, బీసి అభ్యర్థులు రూ.1100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1 000లు చెల్లించాలి. ఈ ఫీజును అభ్యర్థులు గేట్వే. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. మరిన్ని వివరాలకోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎస్సీహెచ్. ఏపీ.జీవీ.ఇన్ / ఇఎపీసీఈటీని సందర్శించాలన్నారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడం తో వెయిటేజ్ మార్కులపై ఉన్నత విద్యా మండలి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
0 Response to " Notification release"
Post a Comment