12th class CBSE results released
12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.
12వ తరగతి సీబీఎస్ఈ పరీక్ష ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది.మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్(cbseresults.nic.in లేదా cbse.gov.in)ను వీక్షించవచ్చు.ఈ వెబ్సైట్ తో పాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్లో ఫలితాలను చూసుకునే వెసులుబాటు కల్పించారు.
ఫలితాలు పొందే విధానం :
1. విద్యార్థులు తమ రోల్ నంబర్తో పాటు స్కూల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
దేశ వ్యాప్తముగా 99.37శాతం విద్యార్థులు పాస్.
కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దుచేయడంతో మెరిట్ లిస్ట్ను ప్రకటించలేదు. DigiLockerలో స్కోర్ కార్డును పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను వెల్లడించగా రికార్డు స్థాయిలో 99.37శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అలాగే, దిల్లీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 99.84శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించింది. మొత్తంగా 70,004మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించగా.. 1,50,152మంది విద్యార్థులు 90శాతం పైగా మార్కులు సాధించినట్టు బోర్డు వెల్లడించింది. ఇకపోతే, కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎస్ఏ పాఠశాలల్లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొంది. ఇంకా 65184 మంది విద్యార్థుల ఫలితాలు వెయింటింగ్లో ఉన్నాయని, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు.
పరీక్ష ఫలితాల కోసం...



Nên mua loại giường tầng nào?
ReplyDeletelợi ích khi là