AP Polycet 2021
AP Polycet 2021: ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ
ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా పాలిసెట్ 2021 నోటిఫికేషన్ను జారీ చేసింది.
సెప్టెంబర్ 1వ తేదీన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
ఇక ఈ పరీక్షకు రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు. పాలిసెట్ పరీక్ష రాయడానికి అర్హత, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడన్న పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.
పాలిసెట్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్.ఎస్.సి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఉండాలి. పరీక్షకు మార్చి/ఏప్రిల్ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 26-07-2021 నుంచి ప్రారంభం.
అభ్యర్థులు రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 13-08-2021ని నిర్ణయించారు.
పాలిసెట్ 2021 పరీక్షను 01-09-2021న నిర్వహించనున్నారు.
POLYTECHNICAL COURSE COLLEGES LIST IN AP
0 Response to "AP Polycet 2021"
Post a Comment