ATM Transactions
ATM Transactions : ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్ .. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ప కు డబ్బులు కట్.
ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పెను భారంగా మారనున్నాయి. ప్రతీ నెలా ఖాతాదారులకు పరిమితిలో ఉచిత ఏటీఎం లావాదేవీలను చేసుకునే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే రూ. 20 అదనపు ఛార్జీను వసూలు చేస్తూ వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ఛార్జీ పెరగనుంది. తాజాగా ఉచిత ఏటీఎం లావాదేవీల కంటే మించి చేసే నగదు, నగదేతర ట్రాన్సాక్షన్స్పై అదనపు ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది.
కొత్త ఏటీఎంల ఏర్పాటు, వాటి నిర్వహణ వ్యయం, ఇంటర్ఛేంజ్ ఫీజులు పెరగడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది.
మరోవైపు ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీ నుంచి ఏటీఎంలలో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్చేంజ్ ఛార్జీను రూ. 17కు, అర్దికేతర లావాదేవీపై రూ 6కు పెంచేందుకు ఆర్బీఐ అనుమతించినసంగతి తెలిసిందే. ఇక ఆర్బీఐ ఇంటర్ఛేంజ్ ఫీజ్లో మార్పులు చేయక చాలా ఏళ్లయింది. 2012 ఆగస్టులో చివరిసారిగా ఇంటర్ఛేంజ్ ఫీజ్ మారింది. అలాగే ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీలను 2014 ఆగష్టు నుంచి ఒకేలా వసూలు చేస్తోంది.
0 Response to "ATM Transactions "
Post a Comment