Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government Employees

 Central Government Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆ అలవెన్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.

కరోనా పరిస్థితులు, వరుస లాక్‌డౌన్‌ల నేపథ్యంలో చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ (సీఈఏ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి అలవెన్స్‌ క్లైమ్‌ కోసం వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అనుమతించాలని నిర్ణయించింది. దీని వల్ల 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ క్లైమ్‌ చేయడానికి ఉద్యోగులు ఇబ్బందులుపడేవారు. ఇప్పుడు వారంతా వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అవకాశం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేంద్రం ఆఫీసు మెమొరాండం విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వల్ల పిల్లల రిపోర్ట్‌ కార్డులు, రిజల్ట్స్‌ వంటివి ఇంటికి రావడం లేదు.

దాంతోపాటు ఫీజులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న పరిస్థితి. దీంతో అలవెన్స్‌ కోసం అప్లై చేయడానికి డాక్యమెంట్స్‌ లాంటివి ఏవీ ఉండటం లేదు. ఈ విషయాన్ని పలువురు ఉద్యోగులు ఆయా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ల ద్వారా ప్రభుత్వానికి చేరవేశారు. దీనిపై ఆలోచించిన ప్రభుత్వం... ఈ మేరకు వ్యక్తిగత సర్టిఫికేషన్‌కు అవకాశం ఇచ్చింది.

ఉద్యోగులు ఇప్పుడు ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌ ద్వారా వచ్చిన పిల్లల మార్కుల వివరాలు/రిపోర్టు కార్డు, పేమెంట్‌ వివరాలను ప్రింటవుట్‌ తీసి.. ప్రభుత్వం సూచించిన క్లైమ్‌ మోడ్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 2020, మార్చి 2021 కు ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్లైమ్స్‌ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆయా ఏడాదికి సంబంధించిన పిల్లల మార్కుల మెమోలు, పిల్లల ఫీజుల ఆన్‌లైన్‌ రిసీట్‌లను ప్రింటవుట్‌ తీసుకొని అప్లై చేసుకోవచ్చు.

అయితే.. ఇప్పటికే పాత పద్ధతిలో సీఈఏ కోసం అప్లై చేసుకున్నవాళ్లు మరోసారి అప్లై చేయక్కర్లేదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ తన మెమొరాండంలో పేర్కొంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా పిల్లల క్లాస్‌లు ఆన్లైన్‌లోనే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సీఈఏ విషంయలో తీసుకున్న నిర్ణయం చాలా ఉపయుక్తంగా మారింది. ప్రస్తుతం దేశ పరిస్థితి చూస్తుంటే... ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్‌లైన్‌లో సాగనుంది.

కాబట్టి ఈ విద్యా సంవత్సరం కూడా ఇలానే ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు ఉండనుంది. అలాగే మార్కుల వివారలు /మెమోలు కూడా ఆన్‌లైన్‌/మెసేజ్‌/ ఈమెయిల్‌ రూపంలోనే రానున్నాయి. కాబట్టి వచ్చే మార్చి లోనూ ఇలానే వ్యక్తిగత సర్టిఫికేషన్‌ ద్వారానే సీఈఏ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government Employees"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0