Inter first year exams
ఇంటర్ మొదటి ఏడాదికి పరీక్షలు
ఇంటర్ మొదటి ఏడాదికి అక్టోబరు లేదా నవంబరులో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరంలోకి వచ్చిన విద్యార్థులు అంతకుముందు పదోతరగతి, ఈ ఏడాది మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. వీరికి మార్కులు కేటాయించేందుకు పరీక్షలు నిర్వహించడం అనివార్యమని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గిన అనంతరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరైనా పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపకపోతే కనీస మార్కులు 35చొప్పున ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇంటర్ ఫలితాలు 21న?
ఇంటర్మీడియట్ ఫలితాలను బుధవారం విడుదల చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై కసరత్తు చేస్తున్నారు.
0 Response to "Inter first year exams"
Post a Comment