No for Inter-Marks in EAP Set Waitage
ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు నో
వెయిటేజీ
ఉన్నత విద్యామండలి కార్యదర్శి వెల్లడి
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీ సెట్-2021)కు సంబంధించిన ర్యాంకుల నిర్ధారణ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదు. అభ్యర్థులు సాధించిన మార్కులకే నూరు శాతం వెయిటేజీ ఇస్తారు. కొవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో 2021-22కి మాత్రమే ఈ పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యాశాఖ నుంచి అందిన లేఖ మేరకు ఈఏపీ సెట్- 2021 ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల(25ు)కు వెయిటేజీ ఇవ్వడం లేదని ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.సుధీర్ ప్రేమ్కుమార్ మంగళవారం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి ఎంసెట్ మార్కులకు 75శాతం, ఇంటర్లో గ్రూపు సబ్జెక్టుల(థియరీ+ప్రాక్టికల్స్) మార్కులకు 25శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం 100 మార్కులకు అభ్యర్థి సాధించిన కంబైన్డ్ స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తున్నారు.
19నుంచి ఏపీఈఏపీ సెట్
ఏపీఈఏపీసెట్-2021 ఆన్లైన్ ప్రవేశ పరీక్షలను ఏపీ, హైదరాబాద్లలో ఆగస్టు 19నుంచి నిర్వహించనున్నట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ఎం.రామలింగరాజు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లోనూ, ఆగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లోనూ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈఏపీసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
- ఈఏపీసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
- ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజ్ తొలగిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది.
- ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకింగ్స్ కేటాయిస్తామని వెల్లడించింది.
- కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.
0 Response to "No for Inter-Marks in EAP Set Waitage"
Post a Comment