Schools will reopen from August 16.
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
0 Response to "Schools will reopen from August 16."
Post a Comment