Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tent 'results formula ready

‘టెన్త్‌’ ఫలితాల ఫార్ములా రెడీ

Tent 'results formula ready

  • ఎఫ్‌ఏ-1, 2లలో మార్కులే ప్రాతిపదిక
  • 20 మార్కుల రాత పరీక్షలో పొందిన మార్కులకు 70% వెయిటేజి
  • 30 మార్కుల వ్యక్తిగత నైపుణ్యాలలోపొందిన మార్కులకు 30%!
  • ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 గ్రేడ్లు
  • ఈ-గ్రేడ్‌తో మిగిలిన వాళ్లూ పాస్‌
  • నేడు సర్కారుకు ఛాయారతన్‌ నివేదిక

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఫార్ములా సిద్ధమైంది. కరోనా కారణంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. ఇంటర్నల్‌ పరీక్షల మార్కుల మదింపు విధానం కోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎం.ఛాయారతన్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ బుధవారం సమావేశమై దీనికి సంబంధించిన తుది ఫార్ములాను రూపొందించింది. కమిటీ తన నివేదికను గురువారం పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌కు సమర్పించనుంది. ఆ తర్వాత మార్కుల మదింపు ఫార్ములా, గ్రేడింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌ఫఏ) పరీక్షల మార్కులను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫార్ములాను తయారుచేశారు. ఎఫ్‌ఏ-1 పరీక్ష.. రాత పరీక్ష(స్లిప్‌ టెస్ట్‌) 20 మార్కులకు, విద్యార్థికి సంబంధించిన మూడు వ్యక్తిగత నైపుణ్యాలకు ఒక్కొక్క దానికి 10 మార్కుల చొప్పున 30 మార్కులకు కలిపి మొత్తంగా(20+30) 50 మార్కులకు నిర్వహించారు. దీని ఆధారంగా.. విద్యార్థి రాత పరీక్షలో 20 మార్కులకు సాధించిన మార్కులను 70ు గాను, మిగిలిన మూడు అంశాలలో కలిపి 30 మార్కులకు సాధించిన మార్కులను 30ు గాను పరిగణించాలని కమిటీ నిర్ణయించింది. 

ఈ 100 శాతాన్ని తిరిగి 50 మార్కులకు కుదించి నమోదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎఫ్‌ఏ-2 నుంచి కూడా 50 మార్కులకు లెక్కించనున్నారు. ఈ రెండు ఎఫ్‌ఏ(50+50) పరీక్షల్లో విద్యార్థికి వచ్చిన మార్కులతో గ్రేడింగ్‌లు ఇస్తూ తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ పరీక్షల్లో సాధించిన మార్కులకు నిర్దేశించిన ఫార్ములా మేరకు ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 గ్రేడ్లు ఇస్తారు. ఈ-గ్రేడ్‌తో మిగిలిన వాళ్లనూ పాస్‌ చేస్తారు. ఏ విద్యార్థినీ ఫెయిల్‌ చేయరు. ఇదిలావుంటే.. ఎఫ్‌ఏ పరీక్షల్లో విద్యార్థులు అధిక మార్కులు పొందిన 3 సబ్జెక్టులను ప్రాతిపదికగా తీసుకుని వాటి సగటుతో గ్రేడ్లు ఇవ్వాలని గత సమావేశాల్లో కమిటీ అభిప్రాయపడినప్పటికీ.. అలా అయితే ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు 10/10 గ్రేడ్లు అధికంగా వస్తాయని భావించిన కమిటీ, చివరికి ఆ ఫార్ములాను పక్కనపెట్టింది. దీంతో ఈసారి 10/10 గ్రేడ్లు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని సమాచారం. 

విద్యార్థులకు రెండు సర్టిఫికెట్లు

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా విద్యార్థులకు మార్కులు, గ్రేడులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయనుంది. అప్పుడు విద్యార్థులకు 3 ఎఫ్‌ఏలు, ఒక సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌సఏ) పరీక్షను నిర్వహించారు. మూడు ఎఫ్‌ఏల సగటును 50 శాతానికి, ఒక ఎఫ్‌ఏను 50 శాతానికి మదింపు చేస్తారు. మొత్తం 100 శాతానికి గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు. ఇదిలావుంటే.. గత విద్యా సంవత్సరంలో టెన్త్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్‌ చేశా రు. ఛాయారతన్‌ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకా రం.. విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. అంటే, ప్రతి విద్యార్థికీ రెండు సర్టిఫికెట్లు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఏ సర్టిఫికెట్‌ అయినా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tent 'results formula ready"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0