The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year.
AP పాలిసెట్ తేదీ ఖరారు.
AP పాలిసెట్ వివరాలు
- రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
- (2021-22) సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారంతా పాలిసెట్ కు అర్హులు.
- రాష్ట్రం మొత్తంగా ఇందుకోసం 45 సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 50 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
- విస్తృత బందోబస్తు నడుమ పరీక్షలను కట్టుదిట్టంగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
- ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా సమయానికి రెండు గంటల ముందు కోఆర్డినేటర్ కు అందజేస్తారు.
- రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటవుతాయి.
- WEBSITE https://appolycet.nic.in/default.aspx
0 Response to "The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year."
Post a Comment