The key decisions in yesterday’s Department of Education review are their details
నిన్న జరిగిన విద్యాశాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు వాటి వివరాలు.
కీలక నిర్ణయాలు ఇవే
- ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
- మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి
- రెండోవిడత నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం
- అదే రోజు విద్యాకానుక ప్రారంభం
- నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన
- నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును సీఎంకు వివరించిన అధికారులు
- నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు
- ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలన్న సీఎం
- కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్
- శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2)
- పౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
- పౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)
- ప్రీహైస్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
- హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ)
- హైస్కూల్ ప్లస్ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని తెలిపిన సీఎం.
- పౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది
- శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి.
- శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్కు ఫౌండేషన్స్కూల్స్ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి
- ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు
- శాటిలైట్ పౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది.
- కిలోమీటరు లోపలే పౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది
- మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది
- మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు
- వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం
- ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం
- పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది
- ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు
- ఇంటర్ తర్వాత డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నారు
- కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్ధితి ఉంది
- నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం
- 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం
- తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుంది
- విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం
- ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు
- ఎందుకు ఈ విధానానికి పోతున్నామనే దానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశం
- పౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం
- ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు
- ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు
- తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి
- నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి
- ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి : సీఎం ఆదేశం
- నాడు – నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం
- దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి
- ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి
- మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి
- నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి
- అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నాం
- ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్దీకరణ
- జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధ
- ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం
- మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలి
- అధికారులతో సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
- పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం
- ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదు.
- ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు
- పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదు
- పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి
- అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదు
- అధికారులకు స్పష్టం చేసిన సీఎం
- నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులు పై సీఎంకు వివరాలందించిన అధికారులు
- తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్లో పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు
- అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు
- స్కూల్స్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు
- ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం
- వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్చేశామన్న అధికారులు
- కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
- దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం
- అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
- అలాగే 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
- స్లిప్టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు
- మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడి
0 Response to "The key decisions in yesterday’s Department of Education review are their details"
Post a Comment