These are the decisions to be taken at the first cabinet meeting after the cabinet expansion.
మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలివే.
న్యూఢిల్లీ : ఏపీఎంసీలను (మండీలు) మరింత బలోపేతం చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. మండీలకు మరిన్ని వనరులను అందించడానికి తాము సిద్ధమని, అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత కేబినెట్ సమావేశం జరగడం ఇదే ప్రథమం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడుతూ... ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద మండీలకు లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తోమర్ ప్రకటించారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తోమర్ పునరుద్ఘాటించారు.
ఇక కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవ్య మాట్లాడుతూ... కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి 23,000 కోట్ల రూపాయల 'హెల్త్ ఎమర్జెన్సీ ప్యాకేజీ'ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
0 Response to "These are the decisions to be taken at the first cabinet meeting after the cabinet expansion."
Post a Comment