Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines

2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం - పాఠశాల నిర్వహణ మార్గదర్శకాలు

Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines

Covid 19 మహమ్మారి కారణంగా మూతపడినటువంటి పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి గాను 16-08-21 నుండి పునః ప్రారంభించవలెను.

పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో అనుసరించవలసిన మార్గదర్శకాలు

  •  గ్రామ సచివాలయం యూనిట్ గా 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న ప్రాంతాలలో మాత్రమే పాఠశాలలు పునః ప్రారంభించ వలెను
  • 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న  ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలో 16-8-21 నుండి ప్రారంభించవలెను
  • పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో తరగతికి 20 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా  ఉండేట్లుగా ప్రణాళికను తయారు చేసుకోన వలెను
  • ఒకవేళ తరగతి / సెక్షన్ కు 20 మంది కన్నా ఎక్కువ లేకుండా ఉండే విధంగా పాఠశాలలో ని అందరు విద్యార్థులకు  సదుపాయం ఉన్నట్లయితే పాఠశాల లోని అందరు విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.
  • అలా కాని పక్షంలో తరగతి/ సెక్షన్ కు 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా ప్రణాళిక తయారు చేసుకొని, విద్యార్థులను బ్యాచ్ ల వారీగా అనుమతించ వలెను.
  • పాఠశాలలోని మరుగుదొడ్లను ప్రతిరోజు 1% సోడియం హైపోక్లోరైడ్ తో  తప్పనిసరిగా శుభ్రం చేయించవలెను.
  • పాఠశాలలోని బోధన, బోధనేతర, మధ్యాహ్న భోజన సిబ్బంది మరియు విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి
  • విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా గమనించవలెను
  • వీలైనంత వరకు థర్మల్ స్కానర్ ద్వారా ప్రతి విద్యార్థి యొక్క శరీర ఉష్ణోగ్రతను పరిశీలించ వలెను ఏవైనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వారిని సమీపంలోని ఆరోగ్యకేంద్రం కు పంపి తగిన  టెస్టులు చేయించవలెను.
  • తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పాఠశాల అసెంబ్లీ కార్యక్రమాలు, గ్రూప్ లో చేసే పనులు, సామూహిక ఆటలు... ఎట్టి పరిస్థితులలోనూ నిర్వహించరాదు.
  • విద్యార్థులకు హ్యాండ్ శానిటైజర్ ను అందుబాటులో ఉంచవలెను.
  • మధ్యాహ్న భోజనం ముందు.. తర్వాత తప్పనిసరిగా చేతులను (ఆరు దశల్లో )శుభ్రపరుచుకునే విధంగా చూడాలి.
  • తల్లిదండ్రుల యొక్క రాతపూర్వక అనుమతి పత్రం తో మాత్రమే విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.
  • మధ్యాహ్న భోజనం ను అందరు విద్యార్థులకు ఒకే సమయంలో కాకుండా తరగతి వారీగా నిర్వహించ వలెను.
  • విద్యార్థులు ఒకరినొకరు పెన్నులు ,పెన్సిల్లు, ఇతర సామాగ్రి మార్చుకోవడం అనుమతించరాదు.
  • పాఠశాలకు విద్యార్థులను రవాణా చేసే బస్సులు / వ్యాన్ ల లో సగం కెపాసిటీ కి మ మాత్రమే అనుమతించ వలెను.
  • పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన ఇద్దరు ఉపాధ్యాయులు సభ్యులుగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయవలెను.
  • అదేవిధంగా మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయవలెను.
  • పాఠశాలలోని  బోధన, బోధనేతర , మధ్యాహ్న భోజన  సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోనవలెను.
  • విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులకు covid19 మహమ్మారి విషయంలో తీసుకోవలసిన  జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలి.
  • పాఠశాలల్లో అకడమిక్ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో భారత ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించి వలెను.

జిల్లా విద్యాశాఖాధికారి

చిత్తూరు

DOWNLOAD COPY




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Beginning of the 2021-22 Academic Year - School Management Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0