Postpone the start of schools
పాఠశాలల ప్రారంభం వాయిదా వేయండి
ప్రజారోగ్య వేదిక
కరోనా మూడో వేవ్ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఆగస్ట 16 నుంచి పాఠశాలలు ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని, దీన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని. ప్రజారోగ్యవేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి రమణయ్య, టి. కామేశ్వరరావు కోరారు. ఈ మేరకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజారోగ్యవేదిక తరపున శనివారం లేఖ రాశారు. కరోనా రెండోవేవ్ సృష్టించిన బీభత్సాన్ని మరువకముందే మూడో వేవ్ వస్తుందని, ఈ దశలో నూతన వేరియంట్ల వల్ల ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది ఆగస్టు చివరి వారం, సెప్టెంబరులోనే విజృంభించే అవకాశం ఉందని వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నార న్నారు. ఇది నిజమేనన్నట్లు బెంగళూరు, లూథియానాల్లో పిల్లలకు ఎక్కువగా కరోనా సోకడం చూస్తున్నామని గుర్తు చేశారు. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, విద్యార్థుల భవి ష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమైనవే కానీ భవిష్యత్తు కంటే ప్రాణం ముఖ్యమని గమనించాల న్నారు. స్కూళ్లు తెరిచేందుకు తాము వ్యతిరేకం కాదని, కొద్ది రోజులు ఆగి పిల్లలపై థర్డ్వేవ్ ప్రభావం ఎలా ఉందో చూసి తరువాత పాఠశాలలను ప్రారంభిస్తే మంచిదని ప్రజారోగ్య వేదిక అభిప్రాయపడుతుందని లేఖలో పేర్కొన్నా
0 Response to "Postpone the start of schools"
Post a Comment