Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Surviving teacher telling lesson

పాఠం చెబుతూ ప్రాణాలొదిలిన ఉపాధ్యాయుడు.



తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పాఠం చెబుతుండగానే ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతిచెందిన సంఘటన తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. తాడేపల్లిగూడెం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సమసాని వెంకటేశ్వరరావు(50) పట్టెంపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రోజూమాదిరిగానే సోమవారం ఆయన పాఠశాలకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారకస్థితికి చేరిన ఆయన్ను తోటి ఉపాధ్యాయులు తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని ప్రధానోపాధ్యాయుడు రంగారావు, ఎంఈవో వి.హనుమ తెలిపారు. వెంకటేశ్వరరావు భార్య పరమేశ్వరి తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం పాఠశాల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Surviving teacher telling lesson"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0