You can play anymore!
ఇక ఆటలాడుకోవచ్చు!
- ఆ గ్రామాల్లో హైస్కూళ్లకు అనుబంధంగా ఆటస్థలాల అభివృద్ధి
- స్థలాలు గుర్తించాలని శాప్కు గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇకపై హాయిగా ఆటలాడుకునేందుకు క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఆటస్థలాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తదితర ఆటలు ఆడుకునేందుకు క్రీడా కోర్టులు ఏర్పాటుతో పాటు పిల్లలు, పెద్దల కోసం విశాలమైన రన్నింగ్ ట్రాక్ లు కూడా సిద్ధం చేయబోతోంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధులను ఇందుకు వినియోగించనుంది. గరిష్టంగా రూ.10 లక్షల వ్యయంతో వీటిని అభివృద్ధి చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధు లు అందుబాటులో ఉండడంతో.. ఆయా జిల్లాల్లో ఈ ఏడాదే అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ 2 రోజుల కిత్రం శాప్ ఎండీ, వైస్ చైర్మన్లకు లేఖ రాశారు. ఆ నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా క్రీడా కోర్టులు ఏర్పాటు చేసేందుకు గ్రామాల్లో తగిన స్థలాలు గుర్తించాలని కోరారు.
0 Response to "You can play anymore!"
Post a Comment