The Railway Recruitment Board has issued a notification to fill the vacant Goods guard posts in the South Eastern Railway, which is part of the Indian Railways.
భారతీయ రైల్వేలో భాగమైన సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్గార్డ్ (Goods guard)పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు కోల్కతా కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 520
పోస్టుల వివరాలు
జనరల్ 277
ఓబీసీ 87
ఎస్సీ 126
ఎస్టీ 30
చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 42 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, అరిథ్మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 23.12.2021
వెబ్సైట్: https://www.rrcser.co.in
0 Response to "The Railway Recruitment Board has issued a notification to fill the vacant Goods guard posts in the South Eastern Railway, which is part of the Indian Railways."
Post a Comment