Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet

నేడు కేబినెట్ భేటీ



ఉద్యోగుల పీఆర్సీ, ఒమిక్రాన్ పై ప్రధాన చర్చ


 PRC పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ప్రధానంగా పీఆర్సీపైనే ప్రధాన చర్చ జరుగనున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఆందోళన చల్లార్చేందుకు మంత్రివరం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ఏడాదిలో తొలిసారిగా ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో పలు కీలక అంశాలు ఈ చర్చకు రానున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోన్నందున దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ దృష్టి సారించనుంది. లాక్ డౌన్, పాఠశాలకు సెలవులు, పరీక్షలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సినిమా టికెట్ల అంశం చర్చకు రానున్నది. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు.. ఇతర ప్రతిపాదనలపై మంత్రులు చర్చించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలు, మూడు రాజధానుల కోసం తీసుకుని రాదలిచిన కొత్త బిల్లు.. ప్రస్తావనకు వస్తుందని తెలుస్తోంది. మొత్తం అజెండాలో 25కు పైగా అంశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా, సచివాలయంలో మంత్రివర్గ సమావేశం రోజే పీఆర్సీపై ఉమ్మడి పోరాటం అందుకు నూత ఏర్పాటయిన పీఆర్సీ సాధన సమితి తొలి సమావేశం కూడా సచివాలయంలో జరపాలని నేతలు నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.

అంతే కాకుండా స‌మ్మె చేయ‌డానికి కూడా సిద్ధం అని ప్రకటించారు .ఈ నెల 21 న స‌మ్మె నోటీసులు కూడా ఇవ్వనున్నారు. దీంతో పీఆర్సీ పై రాష్ట్ర కేబినెట్ లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే సినిమా టికెట్ల ధ‌రల విష‌యంలో కూడా రాష్ట్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, సీఎం జ‌గ‌న్ స‌మావేశం అయిన విష‌యం తెల్సిందే. ఈ స‌మావేశంలో సినిమా ఇండ‌స్ట్రీకి అనుకూలం నిర్ణయం వ‌స్తుంద‌ని చిరంజీవి కూడా ప్రకటించారు. దీంతో సినిమా టికెట్ల ధ‌రల విష‌యంలో కేబినెట్ కీల‌క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఏకంగా 12 వేల కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో క‌రోనా వ్యాప్తి పై కూడా కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా పాఠశాలల కొనసాగింపు పైనా నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదు. ఓ వైపు ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0