Covid
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నందు సీఎం గారు సూచించిన ఆదేశాలు
ముఖ్యాంశాలు
కాల్సెంటర్ పటిష్టంగా పనిచేయాలని అదేశం
టెలిమెడిసిన్ ద్వారా కాల్చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ప్రికాషన డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం
ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం
దీనివల్ల ఫ్రంట్లైన్ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం
అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్న సమావేశంలో నిర్ణయం
రెండో డోస్ వ్యాక్సినేషన్లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.
15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు
మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్ పూర్తి. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్
మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ చేయాలని సీఎం ఆదేశం
మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
0 Response to "Covid"
Post a Comment