Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employs union leaders to the CM camp office

 సీఎం క్యాంపు కార్యాలయానికి ఉద్యోగ సంఘాల నేతలు .

Employs union leaders to the CM camp office

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉద్యోగ సంఘాల నేతలు చేరుకున్నారు.​ పీఆర్సీ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

PRC గురించి కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారంనాడు కూడా ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. గురువారం మరోసారి అధికారులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.


కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ చర్చించి, పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు ఆందోళనలను విరమించుకున్నాయి.

ఉద్యోగ సంఘాల తో ముగిసిన సీఎం వై ఎస్ జగన్ భేటీ

సీఎం వై ఎస్ జగన్ ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ప్రశంసించిన ఉద్యోగ సంఘాలు

సచివాలయ వ్యవస్థ తో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ప్రశంసించిన ఉద్యోగ సంఘాలు

పి ఆర్ సి పై సీఎం సానుకూల నిర్ణయం తీసుకోవాలని  కోరిన బొప్పరాజు

సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న బొప్పరాజు

27 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని కోరిన బండి శ్రీనివాసరావు

ఫిట్ మెంట్ 34 శాతం ఇవ్వాలని కోరిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

ఉద్యోగ సంఘాల అభిప్రాయాల అనంతరం మాట్లాడిన సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు వివరించిన  సీఎం వై ఎస్ జగన్

2, 3 రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సీఎం వై ఎస్ జగన్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employs union leaders to the CM camp office"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0