Latest on PRC ... Details.
PRC పై తాజాగా...వివరాలు.
ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది.
ఉద్యమ కార్యాచరణపై ఇవాళ భేటీ అయిన పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నేతలు పలు విషయాలపై చర్చించారు.
చర్చలకు రావాలంటూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆహ్వానించిన నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో జీవోలు రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాశారు.
అనంతరం మంత్రుల కమిటీ ఆహ్వానం నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు ఆస్కార్ రావు, వైవీ రావు, హృదయరాజు, శివారెడ్డి తదితరులు సచివాలయానికి వెళ్లారు. మంత్రుల కమిటీకి తమ నిరసన లేఖను అందజేశారు.
ఆ లేఖలో ప్రధానంగా మూడు అంశాలను తమ డిమాండ్లుగా పేర్కొన్నారు. పీఆర్సీ జీవోల రద్దు, ఉద్యోగులకు పాత జీతాలు చెల్లింపు, పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలనే డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.
మంత్రుల కమిటీ సమావేశ వివరాలు చెప్పిన సజ్జల
ఫిట్మెంట్% Already యూనియన్స్ అంగీకరించాయి Resolve అయినది .దానిని తిరగ తోడటం జరుగదు.PRC G.O లను Abeyance లో పెట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన GOs రద్దు చెయ్యకుండా తరువాత నైనా G.O లలోని అంశాలలో మార్పులు చెయ్యొచ్చు .
ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ రాలేక పోయారు.మరల 27 వ తేదీన చర్చలకుపిలుస్తాం
IR Recovery లాంటి చిన్న చిన్న corrections ఉంటే చేస్తాము
గంటన్నర సేపు జరిగిన సమావేశము లో Positive Approach కొంత వచ్చినది.
ఎన్ని సార్లైనా చర్చలు జరుపుతాము .మేము ఈ రోజు వారికోసం చాలా సేపు ఓర్పుగా వేచి ఉన్నాము.
సజ్జల కామెంట్స్ :
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే : సజ్జల
ఫిట్మెంట్ పై నిర్ణయం జరిగిపోయింది
మిగతా విషయాలపై చర్చలు ఉంటాయి : సజ్జల
ఈ రోజు మంత్రుల కమిటీ తో స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చలకు రావాలంటే (27 వతేదికి)పెట్టిన షరతులు
1) ఆశితోష్ కమిటీ రిపోర్ట్ విడుదల చేయ్యాలి.
2) జనవరికీ పాత జీతాలే ఇవ్వాలి.
3) PRC జివోలు రద్దుచేయాలి...
వీటికి ఒకే అయితేనే చర్చలకు మా నాయకులు వస్తారని మంత్రుల కమిటీ కి తెలిపిన స్టీరింగ్ కమిటీ నాయకులు
0 Response to "Latest on PRC ... Details."
Post a Comment