నాలుగు స్లాబుల్లో హెచ్ఆర్ఏ పెంపు
- ఉద్యోగులతో ఒప్పందం మేరకు మార్పులు
- పీఆర్సీ కొత్త జీవోలు జారీ
- 2024 జూన్ వరకు సెక్రటేరియట్, హెచ్ఐడీ ఉద్యోగులకు 24 శాతం
- రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిర్ధారణ
ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు స్లాబుల్లో హెచ్ఎర్ఎ పెంచుతూ కొత్త జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వేతన సవరణకు సంబంధించిన చర్చల్లో ఈనెల మొదటి వారంలో మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం ప్రకారం హెచ్ఎస్ఏ, సీసీఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జీవోలు విడుదల చేసింది. 2024 జూన్ వరకు సెక్రటేరియేట్, హెచ్ఓడీ ఉద్యోగులకు 24 శాతం హెచ్చార్ఎ ఇవ్వనున్నారు. అలాగే ఏపీ భవన్, హైదరాబాద్లో ఉండే ఏపీ ఉద్యోగులకు 24 శాతం హెచ్చారీ వర్తించనుంది. ఇక జిల్లా కేంద్రాల్లో 16శా తం, మిగతా ప్రాంతాలవారికి 12 శాతం, ఇతర ప్రాంతాలవారికి 10 శాతం బేసిక్ పే వర్తింపచేస్తూ జీవో జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్ల సవరణను 2022 జనవరి నుంచి కొత్త వేతన స్కేళ్లు అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నెలకు చెల్లించిన వేతనాల్లో హెచ్చుతగ్గులను సవరిస్తామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2022 నెలకు సంబం ధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని డీడీఓలకు ఆదేశాలు ఇచ్చింది.
0 Response to " "
Post a Comment