Initial teacher salaries
తొలుత ఉపాధ్యాయుల వేతనాలు
- వారి స్కేళ్ల నిర్ధారణే ముందు
- ఆనక మిగిలిన ఉద్యోగులది
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2022 వేతన సవరణ ప్రకారం స్కేళ్ల నిర్ధారణ, పే ఫిక్సేషన్ వేగంగా చేపట్టాలని ఉన్నతాధికారులు వెంటపడుతున్నారు. కొత్త పీఆర్సీని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కొత్త వేతన ఖరారులో తొలుత ఉపాధ్యాయుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఖజానా అధికారులకు అనధికార వర్తమానం అందింది. ఫిబ్రవరి 27లోపు రాష్ట్రంలోని అందరు ఉపాధ్యాయులు, ఉద్యోగుల కొత్త వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంతవరకు డ్రాయింగ్ డిస్బర్సుమెంట్ అధికారుల రిక్వెస్టు సైటు ఉండేది. అది ఇక పని చేయబోదని, ఇక వేతనాల బిల్లులన్నీ పేరోల్ ప్రోగ్రాంలోనే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలుత రాష్ట్రంలోని అందరు డ్రాయింగ్ డిస్బర్సుమెంటు అధికారులు 2022 వేతన సవరణ వివరాలను (డేటా) నిర్ధారించాల్సి ఉంటుంది. తర్వాత ఖజానా అధికారులు వాటిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త పీఆర్సీ ఉత్తర్వులు (ప్రొసీడింగులు), సిబ్బంది పేర్లు, జీతాల బిల్లులు కనిపిస్తాయి.
- అందరు డ్రాయింగు డిస్బర్సుమెంట్ అధికారులు ఫిబ్రవరి 18లోగా వివరాలను నమోదు చేయాలి. వాటిని ఖరారుచేసి ఖజానా అధికారులకు పంపాలి.
- ఫిబ్రవరి 21నాటికి ఖజానా అధికారులు, పేఅండ్అకౌంట్సు అధికారులు వేతనాలను ఖరారు చేయాలి.
- జిల్లా కలెక్టర్లు డీడీవోలను పర్యవేక్షించాలి. రాష్ట్రస్థాయిలో విభాగాధిపతులు ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలి.
- తొలుత సర్వీసు రిజిష్టర్లు పరిశీలించి 1.7.2018 నాటికి మూలవేతనాన్ని నిర్ధారించాలి. ఆ తర్వాత ఆయా ఉద్యోగి ఆర్జన, మినహాయింపులు నమోదు చేసి డీడీవోలు ఖరారుచేయాలి. అక్కడినుంచి మళ్లీ ఖజానా అధికారులకు పంపాలి. వారు ఖరారు చేసి సీఎఫ్ఎంఎస్కు పంపుతారు. అక్కడ పరిశీలించి మళ్లీ డ్రాయింగు డిస్బర్సుమెంట్ అధికారులకు పంపుతారు. సరిచూసుకున్నాక అక్కడినుంచి ఖజానా అధికారుల ద్వారా సీఎఫ్ఎంఎస్కు చేరుతాయి. అక్కడినుంచి రిజర్వు బ్యాంకుకు పంపి జీతాలు జమ చేస్తారు.
0 Response to "Initial teacher salaries"
Post a Comment