Teachers Special
ఉద్యోగి పాడె మోసిన డీఈఓ
- అమర్ అంతిమయాత్రలో పాడె మోస్తున్న డీఈఓ
- రోడ్డుప్రమాదంలో గాయపడిన SCO
- ఎంపీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస, ఎమ్మెల్యే అనంత, వందలాది టీచర్ల ఘన నివాళి
అనంతపురం విద్య, ఫిబ్రవరి 12:
రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఏఎ్సఓ అమర్నాథ్రెడ్డి (42) పాడెను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శామ్యూల్ మోశారు. టీచర్గా, SCO గా ఆయన విద్యాశాఖకు చేసిన సేవలు స్మరించుకుంటూ చలించిపోయారు. డీఈఓ ఆఫీస్ లో పనిచేస్తున్న అమర్నాథ్రెడ్డి శుక్రవారం విధులకు వస్తూ నాయనపల్లి క్రాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లినా.. ఫలితం లేకపోవడంతో శనివారం అనంతపురానికి తీసుకురాగా మరణించారు. పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, పామిడి ఎంపీపీ మురళీధర్ రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి వందలాది మంది ఉపాధ్యాయులు సందర్శించారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం గార్లదిన్నె మండలంలోని తిమ్మంపేటకు తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది ఉపాధ్యాయులు, సమగ్రశిక్ష ప్రాజెక్టు, విద్యాశాఖ అధికారులు, ఆయన బంధువులు నివాళులర్పించారు.
0 Response to "Teachers Special"
Post a Comment