Half day schools after Ugadi
ఉగాది తర్వాత ఒంటిపూట బడులు!
రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ను ప్రాథమిక విద్య డైరెక్టర్ సురేశ్కుమార్ ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఓకే చెబితే ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు జరుగుతాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. శనివారం ఉగాది పండుగ, ఆ మరుసటి రోజు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావొచ్చు!
ఆప్షన్లు తీసుకుని..కొత్త జిల్లాల్లో పోస్టింగ్లు
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో ఉన్న ఉద్యోగులను అదే జిల్లాలో సర్దుబాటు చేయడమా? కొత్త జిల్లాల్లో చేస్తారా? అన్నదానిపై ఆప్షన్లు అడుగుతారు. వారి ఆప్షన్ల మేరకే బదిలీలు చేస్తారు.
0 Response to "Half day schools after Ugadi"
Post a Comment