Mobile e-attendance for teachers: Opportunity to register attendance only at school.
ఉపాధ్యాయులకు మొబైల్ ఈ- హాజరు : పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం.
వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే
సెల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరుకు పాఠశాల విద్యాశాఖ నాలుగు రకాల యాప్లను రూపొందించింది . వీటిని నాలుగు జోన్లలోని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తోంది.
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈనెల 26 న ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభించగా... తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పరిశీలన చేపట్టనున్నారు . అనంతపురంలో ఈనెల 31 న , ప్రకాశంలో ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మొదట 15 మండలాల్లో అమలు చేయనున్నారు . అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా జిల్లా మొత్తం ఈ యాప్ ఆధారిత హాజరును అమల్లోకి తీసుకువస్తారు . హాజరు యాప్ను ఉపాధ్యాయులు తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం ఉంటుంది.
వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే తీసుకోనున్నారు . ఇప్పటికే కృష్ణా జిల్లాలో జనవరి నుంచి అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు . సెల్ఫోన్లోని యాప్ ద్వారా తరగతిలోని పిల్లల ఫొటో తీసి , ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . ఫొటోలోని విద్యార్థుల ఆధారంగా హాజరు నమోదవుతుంది . కృత్రిమేథ సాంకేతికతతో విద్యార్థులను గుర్తిస్తున్నారు .
0 Response to "Mobile e-attendance for teachers: Opportunity to register attendance only at school."
Post a Comment