New Sim Card Rules
Sim Card Rules : వారు ఇకనుంచి సిమ్ కార్డు పొందలేరు. టెలికాం శాఖ కొత్త ఉత్తర్వులు
New Sim Card Rules: ప్రభుత్వం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటి ప్రకారం కొంతమందికి మొబైల్ కనెక్షన్ పొందడం సులభమైతే.
ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం UIDAI ఆధారిత ధృవీకరణ ద్వారా కస్టమర్లు తమ ఇంటి వద్ద సిమ్ని పొందవచ్చు. కస్టమర్లు ఇంట్లో కూర్చొని మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇంతకు ముందు కస్టమర్లు కొత్త మొబైల్ కనెక్షన్ కోసం KYC ప్రక్రియ ద్వారా వెళ్లాలి. లేదా మొబైల్ కనెక్షన్ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కి మార్చాలి. ఇందుకోసం ఖాతాదారులు తమ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో స్టోర్కి వెళ్లాల్సి వచ్చేది. కరోనా కాలంలో కస్టమర్ల సౌలభ్యం కోసం కాంటాక్ట్లెస్ సేవను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టెలికాం డిపార్ట్మెంట్ భావిస్తోంది.
ఆధార్ దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) టెలికం ఆపరేటర్లకు సరికొత్త నిబంధనలు జారీ చేసింది. సెప్టెంబరు 15 నుంచి ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. యూఐడీఏఐ తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై సిమ్కార్డు కోసం ధ్రువీకరణగా ఆధార్ నంబరు ఇచ్చే వినియోగదారుల ఫేషియల్ రికగ్నిషన్, లైవ్ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ప్రతీనెల జరిగే ధ్రువీకరణల్లో కనీసం పదిశాతం కొత్త నిబంధనల ప్రకారం ఉండాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరించింది.
0 Response to "New Sim Card Rules"
Post a Comment