AP govt to introduce English Medium for 8th class students: 2022-23
ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ 8 వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం : సీఏం జగన్
AP govt to introduce English Medium for 8th class students: 2022-23 విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రారంభించాలని సీఏం జగన్ నేడు (ఏప్రిల్ 13) క్యాంప్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు.
నాడు - నేడు రెండో దశ పనులపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రెండో దశ పనుల వేగం పెంచాలన్నారు. రెండోదశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు ప్రారంభించాలని, ఈ పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయమైన మార్పులు కనిపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చరిత్రలో మన ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నాడు-నేడు రెండోదశ ఖర్చు రూ. 11,267 కోట్లుగా అంచనా వేశారు. విద్యావ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాలమేరకు అధికారులు ఎస్ఓపీని రూపొందించినట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై మహిళా పోలీసులు విద్యార్ధులకు అవగాహన కల్పించనున్నారు.
0 Response to "AP govt to introduce English Medium for 8th class students: 2022-23"
Post a Comment