Decreasing fertility with pesticides
- రసాయన అవశేషాలతో శుక్రకణాలకు నష్టం
- గ్రామీణప్రాంత రైతులపై ఎక్కువ ప్రభావం
దేశంలో 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయని, ప్రతి జంటలో సంతానోత్పత్తి రేటు 2.1కు పడిపోయిందని వైద్యనిపుణులు వెల్లడించారు. జాతీయ వంధ్యత్వ అవగాహన వారం లో భాగంగా బుధవారం హైదరాబాద్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ నిర్వహించిన సదస్సులో పలువురు వైద్యనిపుణులు ప్రసంగించారు.
పురుగుమందుల్లోని రసాయనాలు శుక్రకణాల డీఎన్ఏను దెబ్బతీస్తున్నాయని, దీంతో టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గిపోయి సంతానలేమి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యలున్న వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటున్నదని తెలిపారు. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతున్నదని వివరించారు. మహిళల్లో అబార్షన్లు, పిండం సరిగా ఎదగపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
0 Response to "Decreasing fertility with pesticides"
Post a Comment