Alert Farmers
Alert Farmers : రైతులకి అలర్ట్ .. కేవైసీ అస్సలు మరిచిపోవద్దు .లేదంటే చాలా నష్టం .
Alert Farmers: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం రైతులు ఈ కేవైసీ అప్డేట్ చేయడానికి చివరి తేదీ మే 31, 2022గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలోని రైతులకు సంవత్సరానికి మూడుసార్లు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది.
పథకం ప్రయోజనం కోసం ఈ కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ పోర్టల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందడానికి ఈ కేవైసీ చేయడం తప్పనిసరి. ఈ పథకం కింద వచ్చే రైతులు ఇంకా కేవైసీని అప్డేట్ చేసుకోకుంటే వెంటనే చేసుకోవాలి. లేదంటే పదకొండో ఇన్స్టాల్మెంట్ రూ.2000 మీ ఖాతాలో జమకావు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ కేవైసీ అప్డేట్ చేసేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఆన్లైన్లో ఈ కేవైసీ చేయు విధానం?
- 1. ముందుగా మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి.
- 2. తర్వాత పేజీకి కుడివైపున కనిపించే eKYCపై క్లిక్ చేయండి.
- 3. ఇప్పుడు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేయాలి.
- 4. తర్వాత ఆధార్ కార్డ్తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి.
- 5. ఇప్పుడు గెట్ OTPపై క్లిక్ చేసి OTP వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేయండి.
ఆఫ్లైన్లో ఈ కేవైసీ చేయు విధానం
- 1. పీఎం కిసాన్ యోజన కింద ఆఫ్లైన్ eKYCని అప్డేట్ చేయడానికి మీరు సమీపంలోని CSCకి వెళ్లాలి.
- 2. అక్కడ పీఎం కిసాన్ ఖాతాలో మీ ఆధార్ను అప్డేట్ చేయాలి.
- 3. తర్వాత బయోమెట్రిక్ ద్వారా ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- 4. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ను అప్డేట్ చేసి ఫారమ్ను సమర్పించాలి.
- 5. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో కేవైసీ అప్డేట్ అయినట్లు మెస్సేజ్ వస్తుంది.
0 Response to "Alert Farmers"
Post a Comment