Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet meeting concluded

 ముగిసిన కేబినెట్ సమావేశం

AP Cabinet meeting concluded


కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం వివరాలు.

 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్​ను ముందుగానే ప్రారంభించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నామని మంత్రులు వెల్లడించారు. గతంలోకంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. మడకశిర నియోజకవర్గంలో ఏపీఐఐసీకి 100 ఎకరాలు కేటాయించామన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి అంబటి అన్నారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలోకంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. గోదావరి డెల్టాకు జూన్‌ 1 నుంచి ధవళేశ్వరం నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. ముందస్తు వ్యవసాయ సీజన్‌కు రైతులు సమాయత్తం కావాలని సూచించారు.

గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. జూన్‌ 10 నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తాం. పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల. పట్టిసీమపై ఆధారపడకుండానే నీరు ఇవ్వొచ్చు. నాగార్జునసాగర్‌ నుంచి జులై 15 నుంచి నీరు విడుదల. ఇతర ప్రాజెక్టుల నుంచి జులై 15 నుంచే నీరు విడుదల. రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జులై 30 నుంచి నీరు విడుదల. ఖరీఫ్‌ సీజన్‌ ముందే ప్రారంభిస్తే.. ముందే పంట చేతికి వస్తుంది. నవంబర్‌లో తుపానులు వచ్చేనాటికే పంట చేతికి వస్తుంది. రైతులు కూడా మూడు పంటలు వేసుకోవచ్చు. గతంలో ప్రాజెక్టులు నిండాక ఆగస్టులో నీరు ఇచ్చేవారు."
-అంబటి రాంబాబు, మంత్రి

సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్‌ రూపొందించి పాటిస్తున్నామని మరో మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈనెల 16న మత్స్యకార భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈనెల 19న యానిమల్‌ అంబులెన్స్‌ ప్రారంభిస్తామని తెలిపారు. జూన్‌ 6న వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మడకశిర నియోజకవర్గంలో ఏపీఐఐసీకి 100 ఎకరాలు కేటాయింపు చేశామన్నారు. రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపందన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet meeting concluded"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0