Ministers Committee On CPS
పాత పింఛన్ విధానం అమలు అసాధ్యం.. జీపీఎస్లో ఇంకా ఏం కావాలో చెప్పండి'
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో చర్చలు
Ministers Committee On CPS: పాత పింఛన్ విధానం అమలు సాధ్యం కాదని సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. పాత పింఛన్ విధానం ద్వారా..న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంత్రుల కమిటీ సభ్యులు బొత్స, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేశారు.
GPSవిధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని సూచించారు. ఈ మేరకు సీపీఎస్ ఉద్యోగులకు నచ్చజెప్పాలని ఉద్యోగ నేతలను కోరారు.
జీపీఎస్పై ఆరు ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను మంత్రులకు వివరించారు. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని అన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని వివరించిన ఉద్యోగ సంఘాలు.. అక్కడ 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్లోకి తెచ్చారని అన్నారు. అయితే మంత్రుల కమిటీ మాత్రం.. జీపీఎస్లో ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాలని ఉద్యోగ సంఘాలకు సూచించింది.
అంతకుముందు సమావేశానికి వెళ్తున్న ఉద్యోగ సంఘాల నేతలను ఉద్యోగులు అడ్డుకున్నారు. సీపీఎస్ రద్దు తప్ప.. మరే ప్రత్యామ్నాయానికి చర్చల్లో అంగీకరించవద్దంటూ గులాబీపూలు ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలను కూడా చర్చలకు పిలవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
0 Response to "Ministers Committee On CPS"
Post a Comment